చిత్రం: మల్లీశ్వరి (1951)
సాహిత్యం: శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి
సంగీతం: శ్రీ సాలూరు రాజేశ్వరరావు
నేపథ్యగానం: శ్రీమతి భానుమతీ రామకృష్ణ
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి యీ రేయి నిండెనో
ఎన్నినాళ్లకీ బతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుసమనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయజూచితిని
గడియ యేని యిక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
Thursday, August 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 అభిప్రాయాలు:
Post a Comment